నిజంనిప్పులాంటిది

Mar 26 2023, 11:17

ISRO LVM3-M3 Operation Success: ఇస్రో LVM3-M3 రెండో ప్రయోగం కూడా సక్సెస్, 36 ఉపగ్రహాలు విజయవంతంగా కక్ష్యలోకి
ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ 72 ఉపగ్రహాలను ప్రయోగించడానికి వన్‌ వెబ్‌ తో గతంలో ఒప్పందం చేసుకుంది. 2022 అక్టోబరు 23న 36 ఉపగ్రహాలు, ఈరోజు మరో 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రో మరోసారి సత్తా చాటింది. LVM3-M3 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం 36 ఉపగ్రహాల్లో 16 ఇప్పటికే వాటి వాటి కక్ష్యల్లో కుదురుకున్నాయి. మిగతా 20 ఉపగ్రహాలు రాకెట్ నుంచి విడిపోయి భూమిపై ఉన్న ఎర్త్ స్టేషన్లకు సిగ్నల్స్ పంపిస్తాయని తెలిపారు అధికారులు. విజిబిల్ ఏరియాలో ఆ శాటిలైట్స్ సెపరేషన్ జరగదని చెప్పారు. రాకెట్ ప్రయోగం విజయవంతమైందని, శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్.  ఈ ప్రయోగం ద్వారా UKకు చెందిన నెట్‌వర్క్‌ యాక్సెస్‌ అసోసియేట్‌ Ltd, భారత్‌కు చెందిన భారతి ఎంటర్‌ప్రైజెస్‌ సంయుక్తంగా వన్‌వెబ్‌ ఇండియా–2 పేరుతో రూపొందించిన 5,805కిలోల బరువు కలిగిన 36 ఉపగ్రహాలను భూమికి 450Kms ఎత్తులోని లియో ఆర్బిట్‌లో 87.4° వంపులో వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

నిజంనిప్పులాంటిది

Mar 26 2023, 09:56

నేడు తెలంగాణ సరిహద్దు గ్రామానికి అమిత్ షా

హైదరాబాద్‌: తెలంగాణ సరిహద్దుల్లోని కర్ణాటకలోని ఓ గ్రామంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదివారం పర్యటించనున్నారు. హైదరాబాద్‌ స్టేట్‌లో భాగంగా ఉన్న ఈ ప్రాంతంలోని గోర్ట గ్రామంలో జరిగిన విముక్త పోరాటంలో 200 మంది గ్రామస్తులు మరణించారు.

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా నిర్వహిస్తున్న 75వ హైదరాబాద్‌ స్టేట్‌ విలీన ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమిత్‌షా పాల్గొంటారు. ఈ సందర్భంగా గోర్ట గ్రామంలో అమరవీరుల స్మారక చిహ్నం, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాలను అమిత్‌ షా ఆవిష్కరిస్తారు.

తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్, ఇతర ముఖ్యనేతలు పాల్గొనే అవకాశాలున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్‌ సంతోష్ కు శనివారం రాత్రి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో సంజయ్‌ స్వాగతం పలికారు.

నిజంనిప్పులాంటిది

Mar 26 2023, 09:41

Minister Suresh Safe: మంత్రి సురేష్ కి తప్పిన ప్రమాదం..

విశాఖ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖ ఆర్కే బీచ్ లో పారా మోటరింగ్ కు వెళ్ళేందుకు సిద్ధమవ్వగా ఇసుక తిన్నెల్లో ఒరిగిపోయింది..

ఈ ఘటనతో మంత్రి సురేష్ తో పాటు అక్కడే వున్న ఇతర మంత్రులు షాక్ అయ్యారు. G20 సదస్సుల్లో భాగంగా విశాఖలో మారథాన్, సాహసక్రీడలు జరుగుతున్నాయి.ఆదివారం కావడంతో ఆర్కే బీచ్ లో ఉత్సాహంగా G20 మారథాన్ ప్రారంభం అయింది. మారథాన్ ప్రారంభించారు మంత్రులు ఆదిమూలపు సురేష్,విడదల రజనీ, గుడివాడ అమర్నాథ్..

ఉదయం మారథాన్ ప్రారంభించిన సురేష్….నిర్వాహకులు ఆహ్వానం మేరకు పారా మోటారింగ్ రైడ్ కు బయలు దేరారు. ఈ ఈవెంట్స్ ను మంత్రి విడదల రజనీ జెండా ఊపి ప్రారంభించారు. అయితే, పారా మోటరింగ్ ఫస్ట్ రైడ్ కు వెళ్ళేందుకు ఉత్సాహం చూపించారు మంత్రి ఆదిమూలపు సురేష్. అయితే, విండ్ డైరెక్షన్ సహకరించకపోవడంతో కుదుపులకు గురైంది. మంత్రి క్షేమంగా ఉండటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది..

నిజంనిప్పులాంటిది

Mar 25 2023, 09:23

LB nagar flyover : ఇక సిగ్నల్‌ ఫ్రీగా ఎల్బీనగర్‌ కూడలి.. నేడు మరో పైవంతెన అందుబాటులోకి

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌లో ఈరోజు సాయంత్రం నుంచి మరో పైవంతెన అందుబాటులోకి రానుంది.

వనస్థలిపురం- దిల్‌సుఖ్‌నగర్‌ మార్గంలో ఎల్బీనగర్‌ కూడలి వద్ద నిర్మించిన పైవంతెనను మంత్రి కేటీఆర్‌ సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు..

విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చే వాహనాలకు ఇబ్బంది లేకుండా ఎల్బీనగర్‌ కూడలిని సిగ్నల్‌ ఫ్రీగా మార్చేందుకు రూ.32 కోట్ల వ్యయంతో నిర్మించారు..

నిజంనిప్పులాంటిది

Mar 24 2023, 21:01

Disqualified MPs - MLAs | జైలుశిక్ష పడి.. చట్టసభల సభ్యత్వం కోల్పోయిన నేతలు వీరే!

దిల్లీ: మోదీ ఇంటి పేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకుగానూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి (Rahul Gandhi) జైలుశిక్ష పడిన నేపథ్యంలో ఆయన పార్లమెంట్‌ సభ్యత్వం (MP)పై అనర్హత వేటు పడింది..

అయితే, అప్పీలుకు వెళ్లేందుకు రాహుల్‌కు 30రోజులు గడువు ఉండటంపై కోర్టు నిర్ణయానికి అనుగుణంగా మళ్లీ ఆయన అర్హత పొందే అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్‌ 8(3) ప్రకారం.. ఏదైనా కేసులో దోషిగా తేలి, రెండేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడిన చట్టసభ సభ్యులు (MP/MLAs) తమ సభ్యత్వాన్ని కోల్పోతారు. ఇలా గతంలో తమ లోక్‌సభ, శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయిన నేతలను ఓ సారి పరిశీలిస్తే..

మొహమ్మద్‌ ఫైజల్‌:ఓ హత్యాయత్నం కేసులో లక్షద్వీప్‌ ఎంపీ మొహమ్మద్‌ ఫైజల్‌(Mohammed Faizal)ను అక్కడి సెషన్స్‌ కోర్టు దోషిగా తేల్చింది. దీంతో ఈ ఏడాది జనవరిలో తన పార్లమెంట్‌ సభ్యత్వాన్ని (MP) కోల్పోయారు. అయితే, అనంతరం కేరళ హైకోర్టు స్టే విధించడంతో మళ్లీ ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని న్యాయశాఖ సిఫార్సు చేసింది.

లాలూ ప్రసాద్‌ యాదవ్‌: దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (Lalu Prasad Yadav) కూడా తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. కుంభకోణానికి సంబంధించి 2013లో వచ్చిన తీర్పుతో పార్లమెంటుకు దూరమయ్యారు. అనంతరం జైలుకు వెళ్లిన ఆయన.. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు.

ఆజాం ఖాన్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌ మాజీ సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజాంఖాన్‌ను (Azam Khan).. 2019లో చేసిన ద్వేషపూరిత ప్రసంగం కేసులో న్యాయస్థానం దోషిగా తేల్చింది. రాంపుర్‌ కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం యూపీ అసెంబ్లీ ఆయన్ను అనర్హుడిగా ప్రకటించింది. అంతకుముందు ఎంపీగా ఉన్న ఆయన ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు..

జయలలిత: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత (Jayalalitha) కూడా జైలు శిక్ష కారణంగా అనర్హతకు గురయ్యారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా కూడా పడింది. దీంతో అనర్హతకు గురైన ఆమె.. సీఎం పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అనంతరం 2015లో కర్ణాటక హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెడుతూ నిర్దోషిగా ప్రకటించించడంతో.. మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. చివరకు ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది..

నిజంనిప్పులాంటిది

Mar 24 2023, 21:00

APPSC Group4: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 మెయిన్‌ పరీక్ష తేదీ ఖరారు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రూప్‌ -4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్‌ పరీక్ష తేదీని ఏపీపీఎస్సీ(APPSC) ఖరారు చేసింది..

రెవెన్యూ శాఖలో 670 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇప్పటికే స్క్రీనింగ్ పరీక్ష పూర్తిచేసిన అధికారులు.. మెయిన్‌ పరీక్షను ఏప్రిల్‌ 4న రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

కంప్యూటర్‌ ఆధారిత విధానంలో జరిగే ఈ పరీక్షకు మార్చి 27 నుంచి అభ్యర్థులు హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు, ఈ ఉద్యోగాల కోసం గతంలో నిర్వహించిన స్క్రీనింగ్‌ పరీక్షకు 2,11,341 మంది అభ్యర్థులు హాజరు కాగా.. వారిలో 11,574 మంది మాత్రమే మెయిన్‌ పరీక్షకు అర్హత సాధించారు..

నిజంనిప్పులాంటిది

Mar 24 2023, 13:24

దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై.. సుప్రీంకు 14 విపక్ష పార్టీలు..

దిల్లీ: రాజకీయ కుట్రలో భాగంగా సీబీఐ (CBI), ఈడీ (ED) వంటి సంస్థలను మోదీ సర్కారు దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తున్న విపక్షాలు (opposition parties) తాజాగా ఈ విషయంపై మూకుమ్మడిగా సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు.

ప్రతిపక్షాలపై కేంద్ర దర్యాప్తు ఏజెన్సీల (central probe agencies) వివక్షపూరిత వినియోగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో 14 రాజకీయ పార్టీలు శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం..ఏప్రిల్ 5న విచారణ చేపట్టేందుకు అంగీకరించింది.

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ ED) వంటి దర్యాప్తు సంస్థలు.. కేవలం భాజపా (BJP) ప్రత్యర్థులనే లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఈ పిటిషన్‌లో విపక్షాలు ఆరోపించాయి. ఒకవేళ సీబీఐ (CBI), ఈడీ కేసులు ఎదుర్కొంటున్న నేతలు భాజపాలో చేరితే.. ఆ తర్వాత వారిపై ఉన్న కేసులు ముగిసిపోతున్నాయని దుయ్యబట్టాయి. ''95శాతం కేసులు ప్రతిపక్షాలపైనే. అరెస్టుకు ముందు, తర్వాత దర్యాప్తు సంస్థలు (central probe agencies) పాటిస్తున్న మార్గదర్శకాలు ఏమిటీ?'' అని విపక్ష పార్టీలు ఈ పిటిషన్‌లో కోరాయి.

కాంగ్రెస్‌ (Congress) సహా, తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC), ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP), జనతా దళ్‌ యునైటెడ్‌ (JDU), భారత్‌ రాష్ట్ర సమితి (భారాస BRS), రాష్ట్రీయ జనతా దళ్‌ (RJD), సమాజ్‌వాదీ పార్టీ (SP), శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం), నేషనల్‌ కాన్ఫరెన్స్, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP), వామపక్షాలు, డీఎంకే (DMK) పార్టీలు సంయుక్తంగా ఈ పిటిషన్‌ దాఖలు చేశాయి. మరోవైపు విపక్షాల ఆరోపణలను భాజపా తోసిపుచ్చింది. దర్యాప్తు ఏజెన్సీ (Probe Agencies)లు స్వతంత్రంగానే పనిచేస్తున్నాయని మరోసారి స్పష్టం చేసింది..

నిజంనిప్పులాంటిది

Mar 24 2023, 08:45

Andhra News: మండలిలో మారనున్న బలాబలాలు..

•ప్రాతినిధ్యం కోల్పోయిన భాజపా

అమరావతి: తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో శాసనమండలిలో బలాబలాలు మారనున్నాయి. మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. వీరిలో అధికార వైకాపా సభ్యుల సంఖ్య ప్రస్తుతమున్న 33 నుంచి (గవర్నర్‌ కోటాలో నామినేట్‌ అయిన వారితో కలిపి) 44కు చేరుకోనుంది..

ప్రతిపక్ష తెదేపా సభ్యుల సంఖ్య 17 నుంచి 10కి తగ్గనుంది. పీడీఎఫ్‌కు ప్రస్తుతం అయిదుగురు సభ్యులుండగా ఇక ఆ సంఖ్య మూడుకు పరిమితం కానుంది. భాజపాకు ఉన్న ఒక్క సభ్యుడూ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ పార్టీ మండలిలో ప్రాతినిధ్యం కోల్పోయింది..

తాజాగా ఎమ్మెల్యే కోటాలో 7, స్థానిక సంస్థల కోటాలో 9, పట్టభద్రుల కోటాలో 3, ఉపాధ్యాయుల కోటాలో 2.. మొత్తంగా 21 స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో 17 స్థానాలు వైకాపా, 4 స్థానాలు తెదేపా దక్కించుకున్నాయి.

తెదేపాకు చెందిన మొత్తం 11 మంది సభ్యుల పదవీకాలం ఈ నెలాఖరు, మే నెలాఖరుతో పూర్తికానుంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి నలుగురు గెలిచారు..

వైకాపాకు చెందిన ఏడుగురు సభ్యుల పదవీకాలం ఈ నెలాఖరుతో పూర్తికానుంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన 17 మంది గెలిచారు..

నిజంనిప్పులాంటిది

Mar 24 2023, 08:39

టీడీపీలోకి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి..

నెల్లూరు:వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి నేడు టీడీపీలో చేరబోతున్నారు..

మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరబోతున్నట్టు ఆయన చెప్పారు. అందరూ తరలివచ్చి తనకు మద్దతు తెలపాలని కోరారు. టీడీపీలో చేరుతున్న సందర్భంగా చంద్రబాబునాయుడు, లోకేశ్ ఫొటోలున్న ఫ్లెక్సీలను నగరంలో ఏర్పాటు చేశారు..

ఉదయం నెల్లూరులో భారీ ప్రదర్శన అనంతరం తాడేపల్లికి వెళ్లి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుంటారు. గిరిధర్‌రెడ్డితోపాటు మరికొందరు నేతలు కూడా పార్టీలో చేరుతారు.

వైసీపీ నేత అయిన గిరిధర్‌రెడ్డి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఆయన సోదరుడైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పుతూ రెబల్‌గా మారారు. ఆయన కూడా పార్టీని వీడి టీడీపీలో చేరబోతున్నారన్న ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది..

నిజంనిప్పులాంటిది

Mar 23 2023, 19:32

పెండింగ్‌ బిల్లుల నిధులను వెంటనే విడుదల చేయాలి

•తపస్ మంచిర్యాల

దీర్ఘకాలికంగా e-kubher వద్ద పెండింగ్ లో ఉన్న వివిధ రకాల బిల్లులను మార్చి 31 లోపల విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ నిర్వహించి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ, హైదరాబాద్ కు మంచిర్యాల జిల్లా ట్రెజరీ అధికారి ద్వారా వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అదన ప్రధాన కార్యదర్శి బండి రమేష్ తెలిపారు.

ఏప్రిల్ 2022 నుండి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న వివిధ రకాల బిల్లులైన 8నెలల పిఆర్సి ఎరియర్స్, సిపిఎస్ డిఎ ఎరియర్స్, పింఛన్ బకాయిలు, మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లులు, జిపిఎఫ్ లోన్లు, టి ఎస్ జి ఎల్ ఐ లోన్లు, సప్లమెంటరీ వేతనాల బిల్లులు, సంపాదిత సెలవుల బిల్లులు, KGBV ఉపాధ్యాయుల వేతన బిల్లులు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బిల్లులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ బకాయిల బిల్లులన్నీ ట్రెజరీల్లో మంజూరు అయినప్పటికీ

గత 6నెలల నుండి సంవత్సరం క్రిందటి వరకు సంబంధించిన బిల్లుల బకాయిలు నేటికీ వారి ఖాతాలలో జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక సంవత్సరం మరొక వారం రోజుల్లో ముగుస్తున్నందున వెంటనే నిధులను విడుదల చేయాలని, ఇప్పుడు నిధులు విడుదల కాకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులు జరిగేదాకా నిధులు విడుదల కాక ఇంకా చాలా ఆలస్యం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బిల్లులకు సంబంధించిన నిధులను విడుదల చేసి వారి ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సయింపు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బగ్గని రవికుమార్, జిల్లా నాయకులు చీర సమ్మయ్య, భారతీ అశోక్, నీలేష్ కుమార్, ఎలగందుల రమాదేవి, అడిచర్ల రాజ్ కుమార్, తుల మధుకర్, ఎల్ సత్యనారాయణ, మండల నాయకులు అంకం రమేష్, ఆత్రం నారాయణ, చెట్ల శ్రీకాంత్, మ్యాకం రమేశ్, ఉప్పుల రూపాచారి, దుర్గం చందు, గాజుల రాజేశ్వర్, మహేష్, సందీప్, బింగి రాజ్ కుమార్, పివికె ప్రసాద్ లు పాల్గొన్నారు.